జూబిలంట్ భారతీయ గ్రూప్ భారీ విరాళం !

by Shamantha N |

<p>కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా జూబిలంట్ భారతీయ గ్రూప్ రూ.10 కోట్ల విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చినట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. రెండు గ్రూప్‌ల కంపెనీలు.. జూబిలంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ (భారతదేశంలో అతి పెద్ద ఫుడ్ సర్వీస్ కంపెనీలలో ఒకటైన డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ మాస్టర్ ఫ్రాంఛైజ్), జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ (సమీకృత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ కంపెనీ)లు రూ. 5 కోట్ల చొప్పున [&hellip;]</p>

జూబిలంట్ భారతీయ గ్రూప్ భారీ విరాళం !
X

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా జూబిలంట్ భారతీయ గ్రూప్ రూ.10 కోట్ల విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చినట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. రెండు గ్రూప్‌ల కంపెనీలు.. జూబిలంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ (భారతదేశంలో అతి పెద్ద ఫుడ్ సర్వీస్ కంపెనీలలో ఒకటైన డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ మాస్టర్ ఫ్రాంఛైజ్), జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ (సమీకృత అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ కంపెనీ)లు రూ. 5 కోట్ల చొప్పున విరాళంగా ప్రకటించాయి. జూబిలంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ తమ 5300 ఉద్యోగుల ఒక రోజు స్థూల జీతంతో సహా దాని అన్ని అనుబంధ సంస్థలతో కలిపి ఈ విరాళాన్ని అందజేసింది.

Tags: Corona, Jubilant Bhartia group, ten crore, PM Cares fund

Next Story