గ్రూపు-2 పరీక్షపై అధికారిక ప్రకటన

by Disha Web Desk 2 |
గ్రూపు-2 పరీక్షపై అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులను ఏపీపీఎస్‌సీ అప్రమత్తం చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్షపై అధికారిక ప్రకటన చేసింది. ఎగ్జామ్ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించస్తామని ప్రకటించింది. దీంతో ఈ నెల 25వ తేదీనే ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎవరూ సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని.. పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది. సిలబస్ వివరాల కోసం https://psc.ap.gov.in./ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. కాగా, మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ వచ్చేలోపే వీలైనన్నీ భర్తీ చేయాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది.

Next Story

Most Viewed