- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రియురాలి కోసం ఓ ప్రియుడు ఎవరూ ఊహించని, సాహసించని పనికి పూనుకున్నాడు. ఏ మాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు పోతాయని తెలిసినా.. వెనకడుకు వేయకుండా పాక్ బార్డర్ నే క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. సరిగ్గా అదే సమయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కంటపడటంతో సీన్ రివర్స్ అయింది. ఈ ఘటన గుజరాత్లోని కచ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని ఉస్మానాబాద్కు చెందిన సిద్ధిఖీ మహ్మద్ జిషాన్కు పాకిస్థాన్లోని కరాచీకి చెందిన సమ్రా అనే యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. వీరిద్దరూ రోజువారీగా చాట్ చేస్తూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అది కాస్త ప్రేమగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా…ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు చేసిన యత్నం కాస్త బెడిసికొట్టడంతో ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నాడు.
అదేలాఅంటే పాక్లోని తన ప్రియురాలు సమ్రాను కలుసుకోవడానికి జిషాన్ గుజరాత్లోని కచ్ గుండా పాక్ బోర్డర్ లోనికి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించాడు. అదే సమయంలో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ దళాలు అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. జిషాన్కు బీఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించాడు. దీంతో భద్రతా సిబ్బంది అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించగా వారు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.