హీరోయిన్లను రెండు గంటలు గదిలో బంధించిన హీరోలు.. అందుకోసమేనట!

by  |
Sridevi, Jayaprada,
X

దిశ, సినిమా : ఆనాటి అగ్రహీరోయిన్లు శ్రీదేవి, జయప్రద మధ్య స్టార్ వార్ జరుగుతుండేది. అయితే అదెప్పుడు అసూయ, ద్వేషంతో నిండిపోకుండా స్పోర్టివ్‌గా ఉండేది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌ల్లో చాలా సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్న ఇద్దరు.. ఆన్‌స్క్రీన్ అక్కాచెల్లెళ్లుగా అదిరిపోయే కెమిస్ట్రీ ఇచ్చినా, బయటమాత్రం హాయ్ బాయ్ టైప్ ఉండేవారు. ఎన్నిసార్లు కలిసినా ప్రొఫెషనల్ షేక్ హ్యాండ్ తప్పితే అసలు మాట్లాడుకునే వారు కాదు. అయితే వీరిద్దరు ఎలాగైనా మాట్లాడుకోవాలని, ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ డెవలప్ కావాలని భావించిన ఆనాటి హీరోలు జితేంద్ర, రాజేష్ ఖన్నా.. తనను, శ్రీదేవిని మేకప్‌ రూమ్‌లో బంధించారని తెలిపింది జయప్రద. అయినా సరే తాము ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదని, కనీసం ఐ కాంటాక్ట్ కూడా చేసుకోలేదని చెప్పింది. రెండు గంటల తర్వాత డోర్ ఓపెన్ చేయడంతో ఎవరికి వారు వెళ్లిపోయారని, దీంతో హీరోలు ఇంకోసారి అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదని పేర్కొంది.

శ్రీదేవి చనిపోయిందన్న వార్త ఇప్పటికీ తనను కలవరపెడుతుందన్న జయప్రద.. తనను చాలా మిస్ అవుతున్నానని తెలిపింది. పోటీలేకుండా ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ వెంటాడుతుందని చెప్పింది. తను ఎక్కడ ఉన్నా ఈ మాట చెప్పాలనుకుంటున్నానని.. ఇప్పుడు తనతో మాట్లాడాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయింది. ఇండియన్ ఐడల్ 12 షోకు ముఖ్యఅతిథిగా హాజరైన జయప్రద.. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. తాను నిజంగా అదృష్టవంతురాలినని, తమకు ఒకరిపై మరొకరికి వ్యక్తిగత పగ ఏమీలేదని తెలిపింది. అక్కాచెల్లెళ్లుగా రీల్ కెమిస్ట్రీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయినా రియల్ కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని చెప్పింది. డ్రెసింగ్, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా ప్రతీ విషయంలో పోటీపడిన తాము సరిగా మాట్లాడుకోకపోయినా గౌరవించుకునే వారిమని తెలిపింది.


Next Story

Most Viewed