సరిహద్దులో జవాన్ల ‘ఇండిపెండెన్స్ డే వాక్’

by  |
సరిహద్దులో జవాన్ల ‘ఇండిపెండెన్స్ డే వాక్’
X

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు సరిహద్దుల్లోని భారత జవాన్లు ‘ఇండిపెండెన్స్ డే వాక్’ నిర్వహించాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పోస్టులు, ఫీల్డ్ యూనిట్‌ల దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. సీనియర్ అధికారులందరూ ఆగస్టు 14, 15 రాత్రిళ్లు పోస్టులు, ఇతర కార్యాలయాల్లోనే ఉండాలని సూచించింది. సరిహద్దు పోస్టుల్లో నాలుగు పనులు చేపట్టాలని తెలిపింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం, మొక్కలు నాటడం, పోస్టుకు సంబంధించిన అధికారులు సహా జవాన్లు అందరూ 10 కిలోమీటర్లు నడక, సమర్థులైన 50 జవాన్లతో గ్రాండ్ ఫెస్ట్ నిర్వహించాలని సూచించింది.

Next Story