కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించండి : మాజీ హోంమంత్రి

by Disha Web Desk 23 |
కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించండి : మాజీ హోంమంత్రి
X

దిశ,రాజేంద్రనగర్ : నియోజకవర్గంలోని మైనార్టీ మహిళల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంగళవారం సాయంత్రం 2500 మంది మహిళలతో రాజేంద్రనగర్ డివిజన్ అసద్ నగర్ లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల పుట్టం పురుషోత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed