జవాన్ చనిపోయిన విషయం ఇంకా తండ్రికి చెప్పలేదు.. ఎందుకో తెలుసా?

by  |
Jawan Pradeep
X

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో చనిపోయిన 13 మంది గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. వారి గురించి తెలుసుకోవాలని తెగ సెర్చ్ చేస్తు్న్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. పలువురు ప్రముఖులు, అధికారులు చేస్తున్న ట్వీట్లు వైరల్‌గా మారింది. ఈ క్రమంలో చనిపోయిన జవాన్ల గురించి కొన్ని విషయాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా జేడబ్ల్యూవో ప్రదీప్ గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ట్వీట్‌లో హెలికాప్టర్ నుంచి సహాయ కార్యక్రమాలు చేస్తున్న ప్రదీప్ ఫొటో ఉంది. కేరళ వరదల సమయంలో ప్రదీప్ రెస్య్కూ ఆపరేషన్ చేసినట్లు అందులో ఉంది. దీనితో పాటు ప్రదీప్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్లు అతని తండ్రికి ఇంకా చెప్పలేదని ఉంది. ఆయన తండ్రి అనారోగ్యంగా ఉన్నారని, ఆక్సిజన్ సపోర్ట్ తో ఆస్పత్రిలో ఉన్నారని.. అందుకే ఇంకా ప్రదీప్ మరణ వార్తను చెప్పలేదని ట్వీట్‌లో ఉంది. అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన సాయితేజ కూడా తన భార్య పిల్లలతో వీడియోకాల్ మాట్లాడిన గంటలోనే ప్రమాదం జరగిందంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed