- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: చిన్ననాటి మిత్రుడి కుటుంబం కష్టాల్లో ఉండటం చూసి వారు తట్టుకోలేకపోయారు. బంధువులు, తెలిసిన వారు మాట సాయం తప్ప బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. మన ఆత్మీయులు కష్టాల్లో ఉన్నారంటే అటువైపు చూసేందుకు కూడా ధైర్యం చేయని రోజులివి. అలాంటిది ఇన్నిరోజులు తమతో కలిసి ఉన్న మిత్రుడు ఒక్కసారిగా తమను వదిలేసి దూరంగా వెళ్లిపోయాడని తెలిసినా, అతని కుటుంబం పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయిన మిగతా స్నేహితులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన కల్లెడ రాజుకుమార్ ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో పెద్దదిక్కును కోల్పొయిన కుటుంబం అప్పటినుంచి పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. అది గమనించిన మృతుడి స్నేహితులు..చిన్నప్పటి నుంచి తమతో ఆడి, పాడిన వాడు ఇప్పడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకుని, ఈ విషయాన్ని దేశ, విదేశాల్లో ఉన్న తోటి మిత్రులకు వివరించారు. స్కూలు టీచర్లు, గల్ఫ్ దేశంలో స్థిర పడ్డవారు, వివిధ పనులు చేస్తున్న వారంతా తమ వంతు సాయం అందించేందుకు చేతులు కలిపారు. రూ. 85వేలు జమ చేసి మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరి దాతృత్వాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అభినందనలు తెలిపారు.