జాతీయ జట్టులో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్

by  |
జాతీయ జట్టులో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టీ20 జట్టులోకి ఇద్దరు యువ క్రికెటర్లు వచ్చారు. ఐపీఎల్‌లో తమ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు రెండో టీ20 తుది జట్టులోకి వచ్చారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి వారికి టీమ్ ఇండియా క్యాప్స్ అందించి జట్టులోకి ఆహ్వానించారు. శిఖర్ ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకున్నది.

Next Story

Most Viewed