- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Virat Kohli: ఆర్సీబీ చారిత్రాత్మక విజయంపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..
ప్రస్తుతం క్రికెట్ లవర్స్ అంతా ఎనలేని సంతోషంలో మునిగితేలుతున్నారు.

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం క్రికెట్ లవర్స్ అంతా ఎనలేని సంతోషంలో మునిగితేలుతున్నారు. వారి ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ కలను సాకారం చేసుకుంది. టైటిల్ గెలుచుకోవడం ఒక చారిత్రాత్మక విజయం. అయితే ప్రస్తుతం టైటిల్ గెలుచుకోవడంతో ఈ చారిత్రాత్మక విజయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలువురు సినీ ప్రముఖులు వంటి వారు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా తన హ్యాపీనెస్ను పంచుకున్నారు. ‘‘ఈ జట్టు నా కలను సాధ్యం చేసింది. నేను ఎప్పటికీ మర్చిపోలేని సీజన్. గత 2.5 నెలలుగా మేము ఈ రైడ్ను పూర్తిగా ఆస్వాదించాం. అత్యంత దారుణమైన సమయాల్లో మన వైపు ఎప్పుడూ వెళ్లని ఆర్సీబీ అభిమానుల కోసం ఇది. ఇది అన్ని సంవత్సరాల హృదయ విదారకాలు.. నిరాశలకు సంబంధించినది. ఈ జట్టు కోసం ఆడుతూ మైదానంలో మిగిలి ఉన్న ప్రతి అంగుళం కృషికి ఇది. ఐపీఎల్ ట్రోఫీ విషయానికొస్తే.. నిన్ను ఎత్తుకుని నా స్నేహితుడిని జరుపుకోవడానికి నువ్వు నన్ను 18 సంవత్సరాలు వేచి ఉండేలా చేశావు. కానీ అది ఖచ్చితంగా వేచి ఉండటం విలువైనది. @royalchallengers.bengaluru’’ అంటూ విరాట్ పోస్ట్లో రాసుకొచ్చారు.






