IPL 2026: ఐపీఎల్ చూసేవారికి షాక్ ఇచ్చిన జియో

by velandi.Saikiran |

రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో కోత విధించింది జియో.

IPL 2026:  ఐపీఎల్ చూసేవారికి షాక్ ఇచ్చిన జియో
X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ లవర్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ కొనసాగుతున్న నేపథ్యంలో రిలయన్స్ జియో వినియోగదారులకు ఝ‌లక్ ఇచ్చింది. రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో కోత విధించింది జియో. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని అమాంతం 30 రోజులకు తగ్గిచ్చేసింది రిలయన్స్ జియో. అయితే ఈ ప్లాన్ లో 15 జీబీ మాత్రం డేటా వస్తోంది. జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ప్రయోజనాలను యధావిధిగా మాత్రం అందిస్తోంది.

క్రికెట్ లవర్స్ కు ఊహించని షాక్

వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడుకునే క్రికెట్ అభిమానులకు షాక్ తగలే ప్ర‌మాదం ఉంది. ఐపీఎల్ చూడాల‌నుకునే వారు ఇక‌పై ఎక్కువ సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ఐపీఎల్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కాగా, ఇవాళ ముంబై ఇండియ‌న్స్, ఢిల్లీ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో హ‌ర్ధిక్ పాండ్యాకు అనారోగ్యం నెల‌కొంది. దీంతో ఢిల్లీతో మ్యాచ్ కు దూరం అయ్యాడు.


Next Story