పురుగుల మందు తాగిన ఇంటర్ విద్యార్థి.. ఎందుకంటే..?

by  |
పురుగుల మందు తాగిన ఇంటర్ విద్యార్థి.. ఎందుకంటే..?
X

దిశ, ఆసిఫాబాద్ : పురుగుల మందు తాగి ఓ యువకుడు బలవంతంగా ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన కొముర్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రములో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్పూర్ (టీ)కి చెందిన దినేష్ (21) అనే యువకుడు ఇంటర్ చదివి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు.

చదువు విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన అతను బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించగా.. అక్కడ నుంచి మరల మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం దినేష్ మరణించాడు. తండ్రి నగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిర్పూర్ (టీ) ఎస్ఐ రవికుమార్ తెలిపారు.



Next Story

Most Viewed