పొలం పనుల్లో పేరెంట్స్.. ఇంటికొచ్చే సరికి కూతురు సజీవ దహనం

by  |
పొలం పనుల్లో పేరెంట్స్.. ఇంటికొచ్చే సరికి కూతురు సజీవ దహనం
X

దిశ, ఆమనగల్లు: ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని మానస(18) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్ళడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మానస నిప్పంటించుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పనులు ముగించుకుని తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా కూతురు సజీవ దహనం అయింది. మృతురాలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు కృష్ణయ్య, అండాలు, మరో సోదరి ఉంది. తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ధర్మేష్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed