వాజేడులో ఘోర రోడ్డు ప్రమాదం..

by  |
accident
X

దిశ, వాజేడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెంకటాపురం మండలం, బర్లగూడెం గ్రామానికి చెందిన పాయం రమేష్ (20) రొయ్యూరు గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం పై వస్తున్న రమేష్, పుసూరు బ్రిడ్జి దగ్గర ఏటూరునాగారం వైపు నుండి వాజేడు వస్తున్న ఆటోను వెనుక వైపు నుండి అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్ ను ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed