ఇంకెన్నాళ్లు దర్యాప్తు..?

by  |
ఇంకెన్నాళ్లు దర్యాప్తు..?
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసును సీబీఐ ఇంకెన్నాళ్లు నాన్చుతుందని నిరసిస్తూ కుటుంబ సభ్యులు బుధవారం ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. దర్యాప్తు మొదలు పెట్టి 8నెలలవుతున్నా ఇంతవరకు అతీగతీ లేదన్నారు.

2017లో పదోతరగతి చదివే సుగాలి ప్రీతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి స్కూలు యాజమాన్యం, నిందితులపై కఠిన చర్యలకు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే ఇప్పటిదాకా కేసులో పురోగతి లేదు. దీంతో కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ప్రీతి కుటుంబ సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు.


Next Story

Most Viewed