- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 125 కోట్లతో గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.
మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జీ నిర్మాణం చేపడితే ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు రవాణా దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story