బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష

by  |
బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గోదావరి వంతెన పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 125 కోట్లతో గోదావరి నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు.

మంచిర్యాల-అంతర్గాం మధ్య గోదావరి నదిపై బ్రిడ్జీ నిర్మాణం చేపడితే ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రజలకు రవాణా దూరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed