ఆర్మీలో అవినీతి.. దేశవ్యాప్తంగా సైనికుల ప్రవేశ పరీక్ష రద్దు

by  |
ఆర్మీలో అవినీతి.. దేశవ్యాప్తంగా సైనికుల ప్రవేశ పరీక్ష రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా జరగాల్సిన ఆర్మీ ప్రవేశ పరీక్ష (కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్) రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిన కారణంగా రద్దు చేసినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. పేపర్ లీక్ అయిన కేసులో పుణెలోని బారామతిలో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఆర్మీలో ఇలాంటివి అవినీతి చర్యలను సహించేది లేదని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. మార్చి 2వ తేదీ వరకు సైనికుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల కోసం అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించారు. త్వరలోనే ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆర్మీ వెల్లడించింది.



Next Story

Most Viewed