- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా కలవరం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో విమానప్రయాణాలు చాలా మేరకు తగ్గిపోయాయి. కస్టమర్లు లేక విమానరంగం కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. అయితే, నష్టాల భారీ నుంచి తప్పించుకోవడానికి.. కస్టమర్లకు కరోనా భయం లేని ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్ ప్రకటించింది.
విమానంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాలనుకునే ప్యాసింజర్స్కు కావాలంటే రెండు సీట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందుకోసం 6E డబుల్ సీట్ స్కీంను ఈనెల 24న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.అదనపు సీటు బుక్ చేసుకునే వారు వాస్తవ టికెట్ ధర కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో యాజమాన్యం స్పష్టంచేసింది. దీని ప్రకారం ప్రయాణికుడు బుక్ చేసుకున్న సీట్ పక్కనే రెండోది కూడా కేటాయిస్తామని తెలిపింది.
Next Story