జనవరిలో 6 శాతం పెరిగిన ఎగుమతులు!

by  |
జనవరిలో 6 శాతం పెరిగిన ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఎగుమతులు ప్రస్తుతం ఏడాది జనవరిలో 6.16 శాతం పెరిగి సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దిగుమతులు సైతం 2 శాతం పెరిగి సుమారు రూ. 3 లక్షల కోట్లకు చేరుకున్నాయని, సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు సుమారు రూ. 1.06 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 13.58 శాతం క్షీణించి సుమారు రూ. 16.66 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులు 25.92 శాతం తగ్గి రూ. 21.9 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.


Next Story

Most Viewed