దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు..

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. పాజిటివ్ కేసులు మళ్లీ కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 37,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో కరోనాతో 724 మంది మృతి చెందారు. రికవరీ రేటు 97.22 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, 24 గంటల్లో కరోనా నుంచి 39,649 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,50,899 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,08,74,376 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి 4,08,764 మంది చనిపోయారు.



Next Story