ఉమ్మడి నిజామాబాద్‌లో 28 కేసులు.. వైద్యుడు మృతి

by  |
ఉమ్మడి నిజామాబాద్‌లో 28 కేసులు.. వైద్యుడు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కొంతమేర తగ్గుముఖం పట్టింది. శుక్రవారం 28 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 16 కేసులు కాగా కామారెడ్డిలో 12 కేసుల వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చెందిన 60ఏండ్ల ప్రైవేట్ వైద్యుడు కోవిడ్-19 చికిత్స పొందుతూ గాంధీ అసుపత్రిలో మరణించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకూ 307 పాజిటివ్ కేసులు అయ్యాయి. జిల్లాలో శుక్రవారం 136 సాంపిళ్లకు గాను 120 నెగిటివ్ రాగా 16 పాజిటివ్ వచ్చాయి. కామారెడ్డి జిల్లాలో 12 కేసులు కొత్తగా వెలుగు చూడగా ఆ జిల్లాలో 236 పాజిటివ్ కేసులకు గాను 180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 4 మరణాలు సంభవించగా, నిజామాబాద్ జిల్లాలో 17 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతూ చనిపోయారు.

Next Story

Most Viewed