- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: విదేశాల్లో టెస్ట్ సిరీస్ ఆడే సమయంలో మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. మేము కూడా తొలి టెస్టులో సరైన ఆరంభం కోసం సిద్ధంగా ఉన్నామని టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆదివారం నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ‘దక్షిణాఫ్రికాలో వికెట్లపై ఉండే బౌన్స్, వేగం ఇతర దేశాలతో పోల్చితే చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం కూడా ముఖ్యమే.
అందుకే తొలి టెస్టు కంటే కొంచెం ముందుగానే ఇక్కడకు చేరుకున్నాము. గతంలో ఇక్కడ 2 టెస్టులు ఆడిన అనుభవం ఉన్నది. అందుకే పెద్దగా ఆందోళన చెందడం లేదు. ప్రాక్టీస్తో పాటు మ్యాచ్ సిమ్యులేషన్స్ ఉపయోగించి పిచ్లపై అవగాహన తెచ్చుకున్నాము. ఆస్ట్రేలియాలో కూడా బౌన్సీ, పేస్ పిచ్లపై ఆడాము. కానీ ఇక్కడ పిచ్లు కాస్త మెత్తగా ఉంటాయి. చాలా వేగంగా వికెట్ మారిపోతూ ఉంటుంది. ‘ అని రాహుల్ అన్నాడు. ఇక తాను తిరిగి టెస్టు మ్యాచ్ ఆడతానని నేను అనుకోలేదు. అయితే జట్టులోకి రావడమే కాకుండా వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ సారి కూడా మంచి ప్రదర్శనే ఇవ్వడానికి కృషి చేస్తాను.