- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ : గ్రామాల్లో సమస్యలు పరిష్కరించకుంటే చెక్ పవర్ రద్దు చేస్తానని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సర్పంచ్లను హెచ్చరించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వాయిల సింగారంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ లీక్ కావడం, డ్రైనేజీ లలో పూడికలు తీయక పోవడం, ప్రధాన వీధుల్లో పెంట కుప్పలను ఏర్పాటు చేయడం, పారిశుద్ధ్య నిర్వహణతోపాటు అనేక సమస్యలు ఉండడంతో పాలకవర్గంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారి గ్రామం లో పర్యటిస్తున్న సందర్భంగా మండల స్థాయి అధికారి శ్రీనివాస్ ఎక్కడా కనిపించలేదు. జిల్లా పంచాయతీ అధికారి గ్రామంలో ఉన్నంతసేపు మండల కార్యాలయంలోని ఎంపీడీవో ఉన్నారు.
Next Story