ఉమెన్స్ డే రోజు ఐసీసీ కీలక నిర్ణయం

by  |
ఉమెన్స్ డే రోజు ఐసీసీ కీలక నిర్ణయం
X

దిశ వెబ్‌డెస్క్: ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి క్రికెట్‌లో ఉమెన్స్ టీమ్స్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉమెన్స్ టీమ్స్‌ను పొడిగించే ప్లాన్‌ను తయారుచేశామంది. 2026 నుంచి టీ 20 ప్రపంచకప్‌లో 12 టీమ్స్ ఉంటాయని, ప్రస్తుతం 10 టీమ్స్ మాత్రమే ఉన్నాయంది.

ఇక 2029 నుంచి వన్డే ప్రపంచకప్‌లో 8 టీమ్స్‌ను 10కి పెంచనున్నట్లు ఇవాళ ఐసీసీ ప్రకటించింది. 2024 టీ20 ప్రపంచ కప్ మాత్రం 10 టీమ్‌లతోనే, వన్డే ప్రపంచకప్ కూడా 8 టీమ్‌లతోనే జరుగుతుందంది.

గత నాలుగు సంవత్సరాల్లో ఉమెన్స్ క్రికెట్‌ను మరింత ప్రోత్సహించామని, ప్రపంచవ్యాప్తంగా లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ చేయడంతో పాటు ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐసీసీ తెలిపింది.

Next Story

Most Viewed