- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: ఐఎస్ఎల్ 2020/21 సీజన్లో భాగంగా శుక్రవారం రాత్రి తిలక్ మైదాన్లో ఎస్సీ ఈస్ట్ బెంగాల్, హైదరాబాద్ ఎఫ్సీ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన హైదరాబాద్ క్లబ్ కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఇరుజట్లు తొలి అర్దభాగంలో హోరాహోరీగా తలపడినా ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఇక రెండో అర్దభాగం మొదలయ్యాక 59వ నిమిషంలో ఆంథొని ఇచ్చిన పాస్ను బ్రైట్ ఎనొబకారె గోల్గా మలచడంతో ఈస్ట్ బెంగాల్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రిఫరీ ఇంజ్యూరీ టైం కలిపాడు. ఆ సమయంలో హైదరాబాద్ ఎఫ్సీ ఆటగాడు అరిడానే సాంటానా గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇరు జట్లు 1-1తో ఉండటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆంథొని పిల్కింగ్టన్ డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, ఆకాష్ మిశ్రా హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.