టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

by  |
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా రెండో క్వాలిఫయర్‌-2 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో షేక్ జాయెద్ అబుదాబి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డెవిడ్ వార్నర్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌లో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్న ఇరు జట్లు ఈ సీజన్‌లో ఎలాగైన కప్పు సాధించాలని చూస్తున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టుపై ఏ జట్టు నెగ్గుతుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed