- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జవహర్ నగర్: డబ్బు కట్టలు సంచిలో వేసుకుని ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మల్కాజ్ గిరి ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డ సంఘటన శుక్రవారం రాత్రి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన హర్ష పటేల్ (21), కిషన్ పటేల్ (20) లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాలోని మని ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు కలిసి సికింద్రాబాద్ లోని సిటీ లైట్ హోటల్ వద్ద రూ.20 లక్షల హవాలా డబ్బులను తమ సైలో కారులో పెట్టుకుని బాటా షో రూమ్ రోడ్డు గుండా వెళ్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం ఎస్వోటీ పోలీసులు యాప్రాల్ కూడలి వద్ద పట్టుకుని, కారులో సోదాలు నిర్వహించారు. దీంతో సంచిలో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. ఇద్దరి యువకులతో పాటూ రూ.20 లక్షలను స్వాధీనం చేసుకుని జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.