హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? నేడే ప్రకటన?

by  |
huzurabad by poll
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ తరపున పోటీకి దింపేందుకు అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ రిటన్​ లెటర్​ పంపింది. ఇప్పటికే దామోదర రాజనర్సింహ బృందం నలుగురు అభ్యర్థుల పేర్లను సూచిస్తూ ఏఐసీసీకి నివేదించారు. టీపీసీసీ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలంటూ ఏఐసీసీ సమాచారం పంపించారు. దీంతో టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు సీఎల్పీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపికపై రాత్రి వరకు చర్చించారు.

నేడు ప్రకటన

హుజురాబాద్​ బరిలో కాంగ్రెస్​ పార్టీ నలుగురు అభ్యర్థుల పేర్లను పరిశీలనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం నుంచి అక్కడ ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ స్పీడ్​ పెంచింది. బుధవారం రాత్రి వరకు దీనిపై చర్చించారు. దీనిలో భాగంగా గురువారం భూపాలపల్లి సభ నుంచి టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అభ్యర్థిని ప్రకటించనున్నారు.



Next Story

Most Viewed