పిడుగు పడింది.. దంపతుల ప్రాణాల్ని తీసుకుంది

by  |
పిడుగు పడింది.. దంపతుల ప్రాణాల్ని తీసుకుంది
X

దిశ, మునుగోడు: అకాల వర్షాలు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. పిడుగులు పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన మునుగోడు పరిధి లింగోజిగూడెంలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి, ఐలమ్మ దంపతులు. సోమవారం రాత్రి వర్షం పడుతుందని.. పశువుల కొట్టానికి వచ్చారు. గేదెలను కట్టేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరు ప్రాణాలు విడిచారు. కండ్ల ముందే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులు కానరాని లోకాలకు వెళ్లారని వారి పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed