నది మధ్యలో విరిగిపడిన కొండచరియలు.. టెన్షన్‌లో 11 గ్రామాల ప్రజలు(వీడియో)

by  |
నది మధ్యలో విరిగిపడిన కొండచరియలు.. టెన్షన్‌లో 11 గ్రామాల ప్రజలు(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా లాహౌల్ స్పీతిలో భారీ కొండ విరిగిపడింది. విరిగిపడిన కొండ చరియలు.. చంద్రభాగా నది మధ్యలో పడ్డాయి. దీంతో చంద్రభాగా నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.

ఈ కారణంగా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ ప్రాంతంలో రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed