గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హైకోర్టు సీజే సతీష్ చంద్ర

by  |
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న హైకోర్టు సీజే సతీష్ చంద్ర
X

దిశ, చార్మినార్ ​: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో పాటు ఎంపీ సంతోష్​కుమార్‌తో కలిసి మొక్కలను నాటారు. అంతకుముందు ఎంపీ సంతోష్ కుమార్ మొదటగా సీజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం పట్ల న్యాయమూర్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ రావు, జీపీలు.. జోగినిపల్లి సాయి కృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed