- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : కొవిడ్ 19 కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. షూటింగ్స్ లేక సినీకార్మికులకు పూటగడవని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు పాన్ ఇండియా స్టార్ యశ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఆయన.. ‘కొవిడ్ 19 ఒక అదృశ్య శత్రువు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజల జీవనోపాధిని నిర్వీర్యం చేసింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తీవ్రంగా ప్రభావితమైంది.
ఇలాంటి సమయాల్లో నా సంపాదన నుంచి 3000 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నా. కొవిడ్ సమయాల్లో ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. ఇకపై మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశ, విశ్వాసంతో ముందుకు సాగుదాం’ అని తెలిపాడు. కాగా యశ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా యూట్యూబ్లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.