సెలబ్రెటీలపై హీరో సిద్దార్థ్ సెటైర్.. వారిలా మౌనంగా ఉండకండి అంటూ ట్వీట్

by  |
సెలబ్రెటీలపై హీరో సిద్దార్థ్ సెటైర్.. వారిలా మౌనంగా ఉండకండి అంటూ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలలో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నైట్ కర్ప్యూ పెట్టినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ విషయమై ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. వీటిపై అందరు గళమెత్తాలని హీరో సిద్దార్థ్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై ఘాటు వ్యాఖ్యలు చేసే సిద్దార్థ్ ప్రస్తుతం సెలెబ్రెటీలపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సెలెబ్రెటీలు ఈ సమయంలో మౌనంగా ఉన్నారు.. వారు మాట్లాడకపోవడానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఈ హర్రర్ షో చూస్తూ వారిలానే మీరెందుకు ఉంటున్నారు. వారు ప్రశ్నించుకుంటే మీరు ప్రశ్నించండి.. ప్రభుత్వంను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు ఉంది కదా? భద్రత మరియు భరోసా విషయమై మీరే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుంది ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇన్ డైరెక్ట్ గా సిద్దార్థ్ సెలెబ్రెటీలకు, ప్రభుత్వంతో అవసరముంటుంది.. అందుకే వారు ఇలాంటి విషయాలపై మాట్లాడారు.. మీ భరోసా మీరే చూసుకోవాలి అని సామాన్యులకు సూచిస్తున్నాడని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం సిద్దు, శర్వానంద్ తో కలిసి ‘మహాసముద్రం’ లో నటిస్తున్నాడు.

Next Story

Most Viewed