బ్రేకింగ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

by  |
బ్రేకింగ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
X

దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్‌ స్మగ్లింగ్ మరోసారి బయటపడింది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుకున్నారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హెరాయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Next Story