కరోనా కోసం పీఎమ్ నిధికి హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ విరాళం!

by  |
కరోనా కోసం పీఎమ్ నిధికి హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ విరాళం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వానికి విరాళం ఇచ్చే వారి జాబితాలోకి హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ కూడా వచ్చింది. కరోనా మహమ్మారిని ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రధానమంత్రి కేర్ ఫండ్‌కు రూ. 150 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుత పరిస్థితులన్నీ అనిశ్చితమైనవి, వాటిని అధిగమించేందుకు ప్రపంచమంతా ప్రయత్నిస్తున్న సమయం. దేశీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికుల ప్రయత్నాలను గౌరవిస్తూ ప్రధానమంత్రి నిధికి హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ మద్ధతిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మహమ్మారిపై పోరాడటానికి అనేకమ్మంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags : coronavirus, COVID-19, HDFC Group, PM Cares Fund

Next Story

Most Viewed