హర్యానా మద్యం పట్టివేత…

by  |
హర్యానా మద్యం పట్టివేత…
X

దిశ, కామారెడ్డి : హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని ఓ దాబాలో హర్యానా నుంచి మద్యం తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో రెండు లక్షల విలువ చేసే మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిలువ ఉంచిన తండ్రి కొడుకులు బబ్లు అలియాస్ మహేష్ , సత్యనారాయణలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story

Most Viewed