హ్యాపీ వినాయక చవితి: హరీశ్‌రావు

by  |
హ్యాపీ వినాయక చవితి: హరీశ్‌రావు
X

దిశ, సిద్ధిపేట: వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ కార్యం చేయాలి అన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే అని, అన్ని విఘ్నలు తొలగి అన్ని కార్యాలు సిద్ధించాలని ఆ గణనాథుణ్ణి ఆయన ప్రార్థించారు. ఈ ఏటా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వేడుకగా జరుపుకోలేపోతున్నామని, కరోనా మహమ్మారి విఘ్నం తొలగాలన్నారు. అందరం ఇంట్లోనే మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించుకోని ఇంటిల్లిపాది వేడుకగా పూజించాలన్నారు.

ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని, మట్టి గణపతినే పూజించాలి.. పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రకృతి సిద్ధమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దామన్నారు. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు.. నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితం ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించు కుందామన్నారు. మన అందరిపై విగ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని కోరుకున్నారు. ఈ పర్వదినాన్ని ఎవరి ఇంట్లో వారు వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.



Next Story

Most Viewed