- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలంపిక్స్లో సత్తా చాటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ గర్వపడేలా నీరజ్ పతకం సాధించిన నేపథ్యంలో.. నీరజ్ చోప్రా అభిమాని అయూబ్ పఠాన్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేసిన.. అతని పేరు(నీరజ్) ఉన్నవాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
భరూచ్లోని తన పెట్రోలు బంకులో.. నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 పెట్రోలు ఉచితంగా కొట్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. భరూచ్ జిల్లా నేత్రాంగ్-మోవి రోడ్డులోని పెట్రోల్ పంపులో అయూబ్ పఠాన్.. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆఫర్ను అందుబాటులో ఉంచాడు. అయితే ‘నీరజ్’ అని రుజువు చేసుకునేందుకు ఆధార్ జిరాక్స్ను ఆ పెట్రోలు బంకులో ఇవ్వాలని నిబంధన పెట్టాడు. దీంతో ఆ పేరున్న వారంతా పెట్రోల్ బంకు ముందు క్యూ కట్టారు.
Read More: ఛీ ఛీ.. పుణ్యక్షేత్రంలో పాడుపని..