మహబూబ్‌నగర్‌లో కీలక నిర్ణయం తీసుకున్న వ్యాపారులు

by  |
మహబూబ్‌నగర్‌లో కీలక నిర్ణయం తీసుకున్న వ్యాపారులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పట్టణంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ కిరాణా అసోసియేషన్ వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుండి సాయంత్రం 5గంటల వరకే షాపులను తెరిచి ఉంచేందుకు అసోసియేషన్ నిర్ణయించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శంభు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం యథావిధిగా తెరుచుకొని సాయంత్రం 5 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు వ్యాపారులు తెలిపారు. సూపర్ మార్కెట్లు కూడా మూసి వేయుటకు సహకరించాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్క కిరాణా షాపులో మాస్క్, శానిటేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed