ఆ నిధులు ఎలా వినియోగిస్తారు: గోరంట్ల

by  |
ఆ నిధులు ఎలా వినియోగిస్తారు: గోరంట్ల
X

దిశ, ఏపీ బ్యూరో: పంచాయతీ భవనాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించేందుకు.. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను ఎలా వినియోగిస్తారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు రావడంతో వైసీపీ రంగులు తొలగించేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. అయితే, వైసీపీ నేతల సొంత డబ్బులతోనే రంగులు మార్చాలని చెప్పారు. వెలుగు వైశ్య సదన్ భూముల వ్యవహారంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed