మాకు గర్వంగా ఉన్నది : సుందర్ పిచాయ్

by  |
మాకు గర్వంగా ఉన్నది : సుందర్ పిచాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్‌లో గూగుల్ రూ. 33, 737 కోట్ల పెట్లుబడులు పెట్టనుందని ముఖేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడితో గూగుల్ దాదాపు 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. జియోకు గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని అంబానీ వివరించారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని పిచాయ్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైషన్ ఫండ్‌లో తొలి విడతగా రిలయన్స్‌లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని..ఇది తమకు చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్‌ లేని లక్షలాది మందికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో తాము భాగస్వాములం కావడం గొప్పగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed