ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్

by  |
ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని పటమట ముత్తూట్ ఫైనాన్స్‌‌‌లో భారీ గోల్డ్ స్కామ్ జరిగింది. ఫైనాన్స్ మేనేజన్ వీరబాబు రూ.కోటిన్నర విలువైన బంగారం మాయం చేశాడు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే… కంపెనీతో సంబంధం లేకుండా మేనేజన్ వీరబాబు గోల్డ్ స్కీమ్ పెట్టాడు. అయితే ఈ స్కీమ్ ద్వారా గోల్డ్ డిపాజిట్ చేస్తే.. ఒక గ్రాము ఉచిత బంగారం ఇస్తామంటూ కస్టమర్లను నమ్మించి మోసం చేశారు. విషయం పసిగట్టిన బాధితులు పటమట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు రంగలోకి దిగి మేనేజర్ వీరబాబుతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వీరబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.



Next Story

Most Viewed