యాదాద్రి అద్దాల మండపానికి బంగారు ఉయ్యాల బహుకరణ

by  |
యాదాద్రి అద్దాల మండపానికి బంగారు ఉయ్యాల బహుకరణ
X

దిశ, ఆలేరు: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రధానాలయం పునర్నిర్మాణం జరుగుతోంది. నూతన ప్రధానాలయంలో నిర్మాణం జరుగుతున్న అద్దాల మండపంలో ఏర్పాటు చేసేందుకు స్వామి, అమ్మవారి కోసం ప్రత్యేకంగా బంగారు ఉయ్యాలను హైదరాబాద్ సైనిక్‌పూరికి చెందిన పుట్ట కోట జ్ఞానేశ్వర్‌రావు అనే దాత బహుకరించారు. శనివారం ఈ బంగారు ఉయ్యాలకు బాలలయంలో స్వామి అమ్మవార్లకు ఎదురుగా ప్రత్యేక పూజలు గావించి నూతన ప్రధాన ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు మోహన్ ఆచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటా చార్యులు, శ్రీధరాచార్యులు, అధికా రులు గజ్వేల్ రమేష్ బాబు, తది తరులు పాల్గొన్నారు.



Next Story