పసిడి పరుగులకు బ్రేక్..

by  |
పసిడి పరుగులకు బ్రేక్..
X

దిశ, వెబ్‌డెస్క్: పసిడి పరుగులకు ఎట్టకేలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం (పెళ్లిళ్ల సీజన్)లో సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. బుధవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.249 తగ్గి రూ. 50,675 కు చేరుకుంది.

ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.249 తగ్గి రూ.63,500కు చేరుకుంది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు దిగిరావడానికి దేశీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలు ఏర్పడటమే అందుకు కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.



Next Story