గంజాయి అమ్ముకున్న పోలీసులు.. ఎక్కడంటే !

by  |
గంజాయి అమ్ముకున్న పోలీసులు.. ఎక్కడంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: గంజాయిని అమ్ముకొని రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన పోలీసులపై వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనిల్ అనే వ్యక్తి ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి ఢిల్లీలో అమ్ముతుంటాడు. సెప్టెంబర్ 11న జహంగీర్‌పూర్‌లోని ఓ రూమ్‌లో గంజాయిని పట్టుకున్న పోలీసులు సీజ్ చేశారు. అనంతరం 159కిలోల గంజాయిని అమ్ముకొని పైసలు పంచుకున్నారు. ఇదేక్రమంలో రికార్డుల్లో 920 గ్రాముల గంజాయి మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు రాశారు. అయితే అనిల్ కుటుంబ సభ్యుల దగ్గర రూ.1.50లక్షలు తీసుకొని అతడిని విడిచిపెట్టినట్లు తేలింది. ఈ విషయం మొత్తం ఉన్నతాధికారులకు తెలవడంతో విచారణ జరిపించి ఇద్దరు ఎస్సైలతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.


Next Story

Most Viewed