ఒకే కుటుబంలో నలుగురు ఆత్మహత్య.. కారణం అదేనా..?

by  |
commit suicide
X

దిశ,వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే వీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల వీరి సన్నిహితులు, బంధువులు మరణిచడంతోనే వీరు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు సూసైడ్ నోట్ ద్వారా గుర్తించారు.

మృతుల్లో దంప‌తులు ప్రతాప్, హేమ‌ల‌తతో పాటు వారి కుమారుడు జ‌యంత్‌, కుమార్తె రిషిత ఉన్నారు. ప్రతాప్ టీవీ మెకానిక్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed