బస్సుకు తాకిన విద్యుత్ వైర్లు.. నలుగురు మృతి

by  |
బస్సుకు తాకిన విద్యుత్ వైర్లు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువైయూరు దగ్గర మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు విద్యుత్ తీగలు తాకాయి. విద్యుత్ షాక్‌తో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed