హీరోయిన్ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక.. స్విగ్గీపై సీరియస్

by  |
Nivetha-Pethuraj
X

దిశ, సినిమా : హీరోయిన్ నివేదా పేతురాజ్ షాక్‌కు గురైంది. చెన్నైలోని ఓఎంఆర్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక వచ్చింది. దాంతో ఆశ్చర్యపోయిన హీరోయిన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి.. స్విగ్గీ ఇండియా, శుభ్రత పాటించని రెస్టారెంట్లపై ఫైర్ అయింది. ప్రజలకు సరైన సేవలు అందించడంలో ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఎలా అని మండిపడింది. ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక రావడం ఇది రెండో సారి అని తెలిపిన నివేద.. రెస్టారెంట్లను రోజూ తనిఖీ చేసి, ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే భారీ జరిమానా విధించాలని కోరింది.

‘మూన్‌లైట్ టేక్ అవే ఓఎంఆర్’ రెస్టారెంట్‌కు ఫైన్ వేయాలని, శుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా చెక్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఎంటైర్ నేషన్‌కు ఫుడ్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇండియా.. తమకు అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లపై దృష్టిపెడితే బాగుంటుందని సూచించింది. ఇలా ఆహారంలో బొద్దింకలు ఫ్రై చేసి పంపుతున్న రెస్టారెంట్ల లిస్ట్‌ను యాప్‌లో పెట్టకూడదని కోరింది.

Next Story

Most Viewed