- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ సోకుతుందనే జగ్గారెడ్డి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల్లోకి రావడం లేదని ఘాటుగా విమర్శించారు. మంగళవారం మీడియా సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. జగ్గారెడ్డి తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జగ్గారెడ్డి ప్రజల్లో ఉండకపోవడం బాధాకరమన్నారు. సొంత పార్టీ వారిని సైతం విమర్శించే జగ్గారెడ్డివి మొత్తం గాలి మాటలు, తుపాకీరాముని చేష్టలు అని అన్నారు. రైతుబంధు వంటి పథకాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గాంధీ భవన్లో కూర్చుని ప్రగతి భవన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంగారెడ్డికి ఎవరొచ్చినా అడ్డుకుంటానంటున్న జగ్గారెడ్డి అక్కడ ఎప్పుడైనా ఉన్నాడా? అని ప్రశ్నించాడు. కరోనా వైరస్ సోకుతుందన్న ప్రాణ భయంతోనే ఆయన సంగారెడ్డికి రావడం లేదని విమర్శించారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి ప్రజలు తిరుగుబాటు చేసే సమయం త్వరలోనే వస్తుందన్న చింతా ప్రభాకర్.. ఉచిత సలహాలు ఇవ్వడం మాని ఇకనైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం నేర్చుకోవాలని సూచించారు.