ప్రకృతి ఒడిలో మనవరాలితో మాజీ మంత్రి.. గుర్తు పట్టడం కష్టమే.. ఫొటోలు వైరల్

by  |
Raghuveera
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ చిత్రంలోని వ్యక్తిని గుర్తు పట్టారా..? కాస్తా నిశితంగా పరిశీలించండి. ఆయన గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించారు. వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారు. ఇంతకూ గుర్తు పట్టేశారా..? ఆయనేనండి.. నీలకంటపురం రఘువీరారెడ్డి (ఎన్.రఘువీరారెడ్డి). మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Former Minister

ఆ తర్వాత సాధారణ పౌరుడిలా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రకృతితో మమేకమై.. వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన వేషధారణ పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ నున్నటి సేవ్‌తో తెల్లటి ప్యాంట్, షర్ట్‌తో యువకుడిలా కనిపించే రఘువీరారెడ్డి.. ఇటీవల తెల్లటి గడ్డం, అడ్డపంచతో సామాన్యుడిలా దర్శనం ఇస్తున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఆయన మోపెడ్‌పై వచ్చి సాధారణ పౌరుడిలా ఓటు వేసి వెళ్లాడు. అప్పట్లో ఆయన ఫొటోలు చూసిన వారంతా ఖంగుతిన్నారు. ఆయననేనా.. ఈయన అన్నంతగా రఘువీర మారిపోయారు. ఇటీవల స్థానికంగా జరిగిన పలు కార్యక్రమాల్లోనూ ఆయన అదే పంచ, గడ్డంతో మెరిసిపోయారు.

RV Reddy

N Raghu

ప్రస్తుతం రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో తన పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన మనవరాలు సమీరా రెడ్డితో తీసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తన ముద్దుల మనవరాలికి గ్రామీణ వస్త్రధారణ చేయించి ప్రకృతివనంలో మురిసిపోతున్నాడు. సమీరా రెడ్డికి చిన్నతనం నుంచే వ్యవసాయం, గ్రామీణ నేపధ్యాన్ని పరిచయం చేస్తూ ఆమెకు ఆ వేషధారణ చేయించారు. రఘువీర ఆలోచన, ఉన్నతిని చూసి ప్రజలు ఫిదా అవుతున్నారు.

Raghuveera reddy

Rvr

Next Story

Most Viewed